Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

Amaravati Case ఆ లాయర్‌కు రూ.96 లక్షలు ఫీజు.. ప్రభుత్వ జీవోపై హైకోర్టులో వ్యాజ్యం

రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలింపును సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదికి రూ.96 లక్షలు చెల్లించడానికి జోవో విడుదలయ్యింది. మే 24న ప్రభుత్వం జారీచేసిన 239 జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలయ్యింది. సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డికి రూ.96 లక్షలు ఫీజుగా చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, ఈ జీవో ఏపీ న్యాయవాదుల ఫీజుల నిబంధన-43 ఉల్లంఘించేదిగా ఉందని పిటిషన్ వేశారు. హైకోర్టు లాయర్ చింతల విజయ్‌కుమార్‌ తరఫున న్యాయవాది వై.కమలారాణి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ జీవో చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి, కొట్టివేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో మున్సిపల్, ఆర్థికశాఖ కార్యదర్శులు, అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ (ఏఎంఆర్డీఏ) కమిషనర్‌, అడ్వొకేట్‌ జనరల్‌, సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఖర్చుచేసే రూ.96 లక్షలకు ప్రతివాదులను బాధ్యులుగా ప్రకటించి, వారి నుంచి సొమ్మును రాబట్టాలని కోరారు. రాజధానిని తరలించే శాసనాధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ రిట్‌ పిటిషన్‌, హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటిషన్‌‌లు దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినందుకు నిరంజన్ రెడ్డికి ఫీజు కింద రూ.96 లక్షలు చెల్లింపునకు జీవో ఇచ్చారన్నారు. ఇందులో హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటిషన్‌ విచారణకు ఆయన హాజరు కాలేదని పిటిషనరు పేర్కొన్నారు. తక్కువ ఫీజుతోనే రాష్ట్రం తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్‌ లాయర్లు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని వివరించారు. ఈ వ్యాజ్యంపై జూన్ 10న హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu