Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారా.. హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ బంద్ ?

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో డీజీపీ ఆంక్షల్ని మరింత టైట్ చేశారు. అయితే ఇప్పటి వరకు నగరంలో సరకు రవాణా వాహనాలపై పోలీసులు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. కాని ఈ వాహనాలపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు శాఖ తెలిపింది. ఈ మేరకు 3 కమిషనరేట్ల పరిధులకు ఉత్తర్వులు జారీ చేశారు. రోజు రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకే సరకు రవాణాకు అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. నిర్దేశించిన సమయంలోనే సరకు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ఉంటుందని ఈ విషయాన్ని సరకును రవాణా చేసే వారు గుర్తుంచుకోవాలని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌లను పోలీసులు ఆపేస్తున్నారు. రాష్ట్రంలో ఈ రోజు నుంచి లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ హెచ్చరించింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రహదారులపైకి సరకు రవాణా వాహనాలు వస్తే చర్యలు ఉంటాయని సీపీలు అంజనీకుమార్‌ , సజ్జనార్ , మహేష్ భగవత్ లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మరోవైపు నగరంలో పలు చోట్ల ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌లను పోలీసులు ఆపేస్తున్నారు. నగర వ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో బాయ్స్ వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. తమ వాహనాల్ని పోలీసులు అడ్డుకోవడంతో డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. ఫుడ్ డెలివరీ కోసం వస్తే వాహనాలు సీజ్ చేస్తున్నారని వాపోయారు. డెలివరీ ఆపేయాలని తమ సంస్థల నుంచి సమాచారం లేదని పోలీసులకు చెప్పినా వినడం లేదని అంటున్నారు. ముందుగా సమాచారం ఇస్తే తాము రోడ్ల మీదకు వచ్చే వాళ్ళమే కాదని చెబుతున్నారు డెలివరీ బాయ్స్. మొత్తం మీద లాక్‌డౌన్‌ను కఠినతరం చేయడంతో హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ కూడా బంద్ అయ్యింది.

Post a Comment

0 Comments

Close Menu