Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. జేబులో డబ్బులు లేకపోయినా బస్సులో ప్రయాణం చేయొచ్చు..


  TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు రకాల కొత్త విధానాలకు నాంది పలికిన టీఎస్‌ఆర్టీసీ తాజాగా మరో కొత్త విధానానికి తెర తీసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి మరో వెసులుబాటును కల్పించేందుకు సిద్ధమవుతోంది. బస్సుల్లో చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టేందుకు గాను టికెట్‌ తీసుకునే సమయంలో నగదు రహిత లావాదేవీ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

డెబిట్‌/క్రిడెట్‌ కార్డుల ద్వారా టికెట్‌ కొనుగోలు చేసే విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తొలుత ఈ కొత్త విధానాన్ని హైదరాబాద్, సికింద్రాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. నగదు రహిత, లావాదేవీల్లో భాగంగా ఆర్టీసీ ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న బస్‌పాస్‌ కేంద్రాల్లో క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టడంతో పాటు వినియోగదారులకు శ్రమ తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక జిల్లాలకు వెళ్లే 900 బస్సుల్లో తొలుత కార్డు చెల్లింపులు అందుబాటులోకి తీసుకొచ్చి. ఫలితం ఆధారంగా ఇతర బస్సుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇక టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకునే వారు యూపీఐ పేమెంట్స్‌ చేసుకునే విధంగా ఆర్టీసీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.


Post a Comment

0 Comments

Close Menu