Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

తిరుపతివాసులకు కేంద్రం నుంచి అదిరే శుభవార్త

తిరుపతివాసులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తిరుపతికి తొలిసారి స్పైన్‌జెట్‌ నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, స్పైస్ జెట్‌ సీఎండీ అజయ్‌సింగ్‌లతో కలిసి జెండా ఊపి ఈ విమానసేవలను ప్రారంభించారు. బుధ, శుక్ర ఆదివారాల్లో సర్వీసులు నడుస్తాయి.. ఈ నెల 31 నుంచి వారంలో నాలుగురోజుల పాటు సేవలు కొనసాగనున్నాయి. తిరుపతి విమానాశ్రయం ప్రారంభమై 50 ఏళ్లయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. 2022 మే నాటికి రన్‌వే విస్తరణ పనులు పూర్తిచేసి వైడ్‌బాడీ అంతర్జాతీయ విమానాలు దిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలశ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి ఏటా 3.5 కోట్లమంది భక్తులు వస్తుంటారన్నారు కేంద్రమంత్రి సింధియా. అక్కడ వేంకటేశ్వరుడితోపాటు దర్శించదగ్గ ఎన్నో ఆలయాలు, ఆధ్యాత్మిక స్థలాలున్నాయన్నారు. తిరుపతికి ఇప్పటికే ప్రధాన నగరాల నుంచి నేరుగా విమానాలున్నాయన్నారు. ఇప్పుడు తొలిసారిగా ఢిల్లీ నుంచి నేరుగా విమానం ప్రారంభమవుతోందన్నారు. 2,160 కిలోమీటర్ల దూరాన్ని రెండున్నర గంటల్లో చేరుకుంటుందని తెలిపారు. దేశంలోని మధ్యతరహా, చిన్ననగరాలను విమానాలతో అనుసంధానం చేయాలని నిర్ణయించామన్నారు. 2024 నాటికి కొత్తగా 100 విమానాశ్రయాలు నిర్మిస్తామన్నారు.

Post a Comment

0 Comments

Close Menu