Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

పెట్రోల్ రూ.34.. డీజిల్ రూ.29..

పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. దీంతో కేవలం వాహనదారులపై మాత్రమే కాకుండా సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇప్పటికే దేశంలో చాలా చోట్లు పెట్రోల్ ధర రూ.120 దాటేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో రూ.110 పైకి కదిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండేళ్ల కాలంలో ఏ స్థాయిలో పెరిగియో తెలిస్తే.. షాక్ అవాల్సిందే. పెట్రోల్ రేటు ఏడాదిలో 32 శాతం పెరిగింది. అదే రెండేళ్లలో అయితే 46 శాతం పైకి కదిలింది. గత నెలలో పెట్రోల్ ధర రూ.5, డీజిల్ ధర రూ.6 మేర పెరిగింది. గత రెండేళ్ల కాలంలో దేశంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.34 పెరిగింది. ఇక డీజిల్ రేటు విషయానికి వస్తే.. లీటరుకు రూ.29.50 పైకి కదిలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం సహా దేశీయంగా పన్నుల బాదుడు కారణంగా ధరలు ఈ స్థాయిలో పెరిగాయి. Also Read: Also Read:

Post a Comment

0 Comments

Close Menu