Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్

కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతుంది. 24 గంటల్లో ఇది పశ్చిమ–వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలను చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో గురువారం కల్లా తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రెండు, మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu