Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

భారత మాజీ క్రికెటర్‌కి రూ.5 వేలు జరిమానా.. చెత్తలో బిల్లు తెచ్చిన తంట

భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాకి రూ. 5 వేలు జరిమానా పడింది. గోవాలోని అల్డోనా గ్రామంలో అజయ్ జడేజాకి ఓ బంగ్లా ఉండగా.. అందులో సేకరించిన చెత్తని సమీపంలోని మరో గ్రామం నచ్చినోలాలో వేసినట్లు తేలింది. దాంతో.. నచ్చినోలా గ్రామ సర్పంచ్ బండోడ్కర్ ఈ జరిమానాని విధించారు. తప్పుని అంగీకరించిన .. మారు మాట్లాడకుండా జరిమానా కట్టినట్లు సర్పంచ్ చెప్పుకొచ్చారు. ‘‘మా గ్రామంలో చెత్తని విసిరి వేసే విషయంపై గొడవలు జరుగుతున్నాయి. పక్క గ్రామాల్లోని చెత్తని కూడా మా గ్రామంలో వేస్తున్నారు. దాంతో.. కొంత మంది యూత్‌ని నియమించి ఆ చెత్త నుంచి ఆధారాలు సేకరించాల్సిందిగా ఆదేశించాం. ఈ క్రమంలో అజయ్ జడేజా పేరిట ఉన్న ఓ బిల్.. అలానే కొన్ని చెత్త బ్యాగ్‌లు కనిపించాయి. దాంతో.. మా గ్రామంలో ఇకపై చెత్త వేయొద్దండి అని మేము అతనికి సూచించాం. అయితే.. అజయ్ జడేజా మాత్రం తాను జరిమానా కడతానని.. రూ.5వేలు జరిమానా కట్టాడు. పాపులర్ క్రికెటర్, సెలెబ్రిటీ అయినా అజయ్ జడేజా ఇక్కడ నివసిస్తుండటం మాకు గర్వకారణం. కానీ.. అందరూ ఇక్కడ నిబంధనల్ని పాటించాల్సిందే’’ అని సర్పంచ్ బండోడ్కర్ స్పష్టం చేశారు. భారత్ జట్టులోకి 1992లో అరంగేట్రం చేసిన అజయ్ జడేజా 15 టెస్టులు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 6 వన్డే సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన అజయ్ జడేజా.. 2000లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా 50 ఏళ్ల అజయ్ జడేజా కొనసాగుతున్నాడు.

Post a Comment

0 Comments

Close Menu