Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

హరితహారంలో ఉద్రిక్తత: ప్రాణాలైనా వదులు కుంటామని గిరిజనులు శపథం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీశాఖ చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ములకలపల్లి మండలం కంపార్టుమెంట్‌ నెం.277, 288లోని 53 హెక్టార్లలో జులై 14న హరితహారం కోసం ముందస్తు పనులు చేపట్టారు. ఈ సమయంలో అధికారులను పోడుదారులు అడుకున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో మాదారం ఉప-సర్పంచి చంద్రశేఖర్‌ సహా 18 మందిపై కేసులు నమోదయ్యాయి. గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా పోడుసాగుదారులు అడ్డుకుంటారన్న సమాచారంతో పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, ఉప సర్పంచి చంద్రశేఖర్‌తో పాటు మరో నలుగుర్ని అరెస్ట్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో పలు గ్రామాల పోడుదారులు ఆ ప్రాంతానికి చేరుకుని నాటిన మొక్కలను పీకేశారు. ఈ క్రమంలో పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ తోపులాటలో మాదారం గ్రామానికి చెందిన రాములమ్మ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో అటవీ సిబ్బంది ఆమెకు సపర్యలు చేసి, చికిత్స కోసం మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సీపీఎం నాయకుడు గౌరి నాగేశ్వరరావుతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం మొక్కలు నాటారు. మరోవైపు, సత్తుపల్లి మండలం రేగళ్లపాడు పోడు భూముల్లో గురువారం అటవీశాఖ అధికారులు, గిరిజనులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. గిరిజనులు భూమిని దున్నుతుండగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. అరకలకు ఎదురుగా బైఠాయించడంతో అధికారులను గిరిజనులు పక్కకు లాగే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని తోపులాటకు దారితీసింది. 20 ఏళ్ల క్రితం పోడు కొట్టుకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అటవీ శాఖ అధికారులు హరితహారం పేరుతో మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలు పోయినా భూములను వదులుకోబోమని తేల్చి చెప్పారు. అయితే, భూములు తాజాగా పోడు చేసుకున్నవేనని, గిరిజనులు వారివద్ద ఎలాంటి ఆధారాలున్న తెచ్చుకోవాలని అధికారులు చెప్పడంతో తోపులాట చోటుచేసుకుంది.

Post a Comment

0 Comments

Close Menu